Wednesday, 2 December 2015

జన చైతన్య యాత్రతో ప్రజలలో ఉత్సాహం నింపిన మన MLA గారు

 రైతుల్లో చైతన్యం తేవడం, జాగృత పర్చడం, ఆత్యహత్యలు చేసుకోకుండా మానసిక స్థైర్యాన్ని కల్పించేందుకు మన గౌరవనీయ శాశన సభ్యులు మరియు AP గిరిజన సంక్షేమ కమిటీ చైర్మన్ శ్రీ మొడియం శ్రీనివాస్ గారు  జన చైతన్య యాత్రను మంగళవారం  శ్రీకారం చుట్టారు. ఈ యాత్రను  పోలవరం  పంచాయతీ లోని స్థానిక  తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు శ్రీ కుంచె దొరబాబు గారి నివాసం నుంచి ప్రారంభించారు 
            మంగళవారం  ప్రారంభమైన ఈ జన చైతన్య యాత్ర మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ లో  పర్యటించి ప్రజలను చైతన్యం చేస్తారు.  మండల పరిషత్ అధ్యక్షులు  శ్రీమతి పైల అరుణ కుమారి, ZPTC శ్రీమతి కుంజం సుభాషిణి గారు  మరియు  MPTC లు ,తెలుగుదేశం సర్పంచుల, పార్టీ  నాయకుల  బృందం యాత్రలో పాల్గొంటారు. ప్రధానంగా రైతులను వ్యసన విముక్తులుగాచేయడం, మూఢనమ్మకాలను విస్మరించేలా, వ్యవసాయ వ్యయం తగ్గించడం, ఉచిత వైద్య, పశువైద్య శిబిరాలు నిర్వహించడం, రైతుల జీవితంలో నైతిక విలువలను ఎలా పెం పొందించుకోవాలో వివరించడమే లక్ష్యంగా యాత్ర సాగుతుందని  MLA  శ్రీ మొడియం శ్రీనివాస్ గారు  తెలిపారు. 

No comments:

Post a Comment